ఆ ఫ్యామిలీ మొత్తం అటువంటి బాధనే అనుభవిస్తారు అంటూ దూషించిన రష్మీ!

Anchor Rashmi: టాలీవుడ్ ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ భామ.. తన కోసమే షో ను చూసేలా చేసుకుంది. ఇక విపరీతమైన అభిమానులను తన సొంతం చేసుకుంది. తన అందంతో ప్రేక్షకులను గ్లామర్ విందును వడ్డిస్తుంది. వెండితెరపై అడుగు పెట్టినప్పటికీ అంత సక్సెస్ కాలేకపోయింది.

Anchor Rashmi
Anchor Rashmi

ఇక రష్మీ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ పోస్టులను అప్ డేట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక ఈమె మూగ జీవులను ఎంతగా ఇష్టపడుతుందో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే రష్మి ఓ వ్యక్తికి కఠినంగా శిక్ష పడినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది.

అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులో ఒక అపార్ట్మెంట్లో ఒక యువకుడు కారు నడుపుతున్నాడు. ఆ కారు నడిపే క్రమంలో ఒక కుక్కను కారు తొక్కించే చేశాడు. దాంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది అని తెలుస్తుంది. ఇక ఆ కారు నడిపిన వ్యక్తికి వ్యాపారపరంగా, రాజకీయంగా చాలా సంబంధాలు ఉన్నాయి.

అయినప్పటికీ ఆ వ్యక్తికి ఆ కుక్క చనిపోయిన విషయంలో కఠిన శిక్ష తప్పలేదు. ఈ విషయం గురించి రష్మీ ఇలా స్పంచింది. “డబ్బుతో వస్తువులను కొనవచ్చు కానీ.. బుద్ధుని పద్ధతిని కొనలేం.. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించారు అని తెలిసి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆ అమాయకపు జీవిని బలి తీసుకున్నందుకు ఆ ఫ్యామిలీ సైతం అనుభవిస్తారు అని” రష్మీ తెలిపింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *