దేశ భద్రతకు చంద్రబాబు ముప్పు తెచ్చారు : అంబటి రాంబాబు

దేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. పెగాసెస్ చంద్రబాబు వాడినట్లు మమత బెనర్జీ చెప్పారని, ఆమె తమ రాజకీయ మిత్రులు కాదని అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, మమతా బెనర్జీ కొంతకాలం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కలిసి ప్రచారం చేసిన వారేనని, ఇప్పుడు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు.

తామేమి పెగాసస్ వాడారని చెప్పలేదు.. ఇలా భుజాలు తడుముకుంటున్నారంటే దీనిలో ఏదో ఉందని అన్నారు. లోకేష్ తిండి ఖర్చులకు రూ. 30 లక్షలు వాడారని రాస్తే సాక్షిపై కేసు వేశారని, మరి ఇప్పుడు మమత బెనర్జీపై కేసు వేస్తారా? అని ప‍్రశ్నించారు.  చంద్రబాబు జీవితమంతా అనైతిక రాజకీయాలేనన్నారు. నాడు చంద్రబాబు ట్యాపింగ్‌ కార్యక్రమాలకు పాల్పడలేదా అని ప‍్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పెగాసస్‌పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.

ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు కూడా ప్రాథమికంగా భావించిందన్నారు. 23 మంది శాసన సభ్యులను తీసుకెళ్లడానికి చంద్రబాబు పోలీసులను వాడుకోలేదా…? అని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వర రావు దీనికి ప్రధాన భూమిక పోషించలేదా…? అని నిలదీశారు. అధికారికంగా కొనకపోతే ప్రయివేటుగా కొనుగోలు చేసి ఉంటారని, రూ. 25 కోట్లు పెట్టి ప్రైవేటుగా కొని ఉంటారని, వెళ్లేప్పుడు వాటిని నాశనం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తాము ప్రత్యర్థుల వీక్ నెస్‌పై ఆధారపడి రాజకీయాలు చేయమన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *