విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పూరి – కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగుతుంది. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మైక్ టైసన్ మెరవనుండటం విశేషం. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

కాగా ‘లైగర్’ విడుదలకు ముందే దర్శకుడు పూరి జగన్నాథ్- నటుడు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో చిత్రం ఖరారైంది. ఈ ఇద్దరు ‘జనగణ మన’ అనే సినిమా కోసం మళ్లీ కలిసి చేస్తున్నారు. సంబంధిత వివరాలు పంచుకునేందుకు చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి, సోషల్ మీడియా వేదికగా పోస్టర్ను విడుదల చేసింది. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. JGM అంటే ‘జన గణ మణ’. ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఆల్రెడీ ఓపెనింగ్ రోజున ఆయన డ్రస్ చూస్తే… ఆ సంగతి తెలుస్తుంది. ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి కథాంశంతో సినిమా రూపొందనుంది.
చిత్ర బృందం విడుదల చేసిన ఫోటోల్ల ఇండియా మ్యాప్తోపాటు, భారత సైనికుల లుక్లో కొందరు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై దర్శకుడు వంశీ పైడిపల్లి, ఛార్మి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2023 ఆగస్టు 3న విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కథానాయిక, సాంకేతిక బృంద వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Leave a Reply