జాతీయ మీడియా విమర్శలతో నెల్లూరు రానున్న సచిన్?

తాను దత్తత తీసుకున్న గ్రామానికి ఓసారి వచ్చి వెళ్లడం తప్పించి తర్వాత అక్కడ జరుగుతున్న పనులపై సచిన్ టెండూల్కర్ దృష్టి నిలపలేదని జాతీయ మీడియా విమర్శలు చేయడంతో స్పందించిన సచిన్ ఈ నెల 16 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తాను దత్తత తీసుకున్న పుట్టంరాజు కండ్రిగ గ్రామానికి రానున్నట్లు జిల్లా అధికారులకు సచిన్ వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన జిల్లా అధికారులు సచిన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టంరాజు కండ్రిగ గ్రామస్థులు తమ గ్రామంలోని యువతకు ఉపాధి చూపే అవకాశాలను కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *