MP Raghurama: మీరేమో అన్ని రేట్లు పెంచుకోవచ్చు.. సినిమా వాళ్లకు తగ్గిస్తారా?- ఆర్​ఆర్​ఆర్​

MP Raghurama: ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఏదో చిన్న చిన్న మాటలతో పోతున్న ఈ సమస్య.. హీరో నాన్న చేసిన కామెంట్లతో అగ్గి రాజేసుకున్నట్లైంది. ఈ క్రమంలోనే హీరో నానిపై అధికార ఎమ్మెల్యే, మంత్రులు మాటలతో విరుచుకుపడుతున్నారు. అయితే, మరోవైపు, నానికి మద్దుగా ప్రతిపక్షాలు గలం విప్పుతున్నాయి. తాజాగా, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్​ను ఉద్దేశించి సామాజిక మాద్యమాల వేదికగా సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్​గా మారింది.

ycp-rebel-mp-raghurama-krishnaraju-satires-in-cinema-ticket

మీ పత్రిక రేట్ పెంచేది.. ‘నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన వార్తలు అందించడానికని అంటారు. మీ సీమెంట్ రేటు పెంచేది.. సిమెంట్ నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన సిమెంట్ అందించడానికని అంటారు. మీ కంపెనీలు అమ్మే విద్యుత్​ రేటు అమ్మేది.. నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడానికని చెప్తారు.. మరి సినిమా హాళ్లలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి, ప్రజలకు మెరుగైన వినోదపు సేవలు అందించడానికి టిక్కెట్ల ధరను ఎలా తగ్గిస్తారు. అంటూ రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం ఈ ట్వీట్​తో సినీ ఇండస్ట్రీతో పాటు, పలువురు నెటిజన్లు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా టికెట్​ కలెక్షన్ల కంటే.. పక్కనుండే కిరాణా కొట్టులో కలెక్షన్లు బాగుంటున్నాయని నాని అన్నారు. మరో వైపు బ్రహ్మాజి కూడా జగన్​ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో టాలీవుడ్​ వర్సెస్​ ఏపీ సర్కార్ అన్నట్లు అయ్యింది పరిస్థితి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *