మామూలుగా నీటిని పట్టుకోవడం కానీ దానిపైన నడవడం కానీ చేయాలంటే అది సాధ్యమైన పని కాదు. ఇంతవరకు కూడా అలాంటి సాహసాలు ఎవరూ చేయలేదు. నిజానికి ఇలాంటి సాహసాలు ఎవరు కూడా చేయడానికి ముందుకు రారు. కానీ తాజాగా ఓ జవాన్ నీటిపై నడుస్తూ అది సాధ్యమవుతుందని నిరూపించాడు. ఇంతకు ఆ జవాన్ ఎవరంటే..

ఈమధ్య ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరు బాగా పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా వింతలు, విన్యాసాలు చేసే వాళ్ళు మాత్రం బాగా తమ పరిచయాన్ని పెంచుకుంటున్నారు. అందులో ఓ జవాన్ కూడా తన విన్యాసాలతో పరిచయాన్ని పెంచుకున్నాడు. అతని పేరు అన్మోల్ చౌదరి.

ఇతడు ఇండియన్ ఆర్మీ లో జవాను గా పని చేస్తున్నాడు. ఇక ఈయన తన పరిచయాన్ని ఇన్ స్టా వేదికగా పెంచుకున్నాడు. అందులో ఆయన రకరకాల విన్యాసాలు చేసిన వీడియోలను తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటూ తెగ ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇక తాజాగా ఈయన కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అందులో అతడు నిండుగా నీరు ఉన్న నాలుగు బకెట్ లను వరుసలో పెట్టి ఏకంగా నీటిపై నడుస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం అతని సాహసానికి ఫిదా అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by anmol Chaudhary (@anmol.__.chaudhary)

అంతేకాకుండా ఒక వెదురు కర్రను వంకరగా నిలబెట్టి దానిపై నిలుచున్నాడు. ఆ కర్ర కింద పడకుండా ఓ కాలు తో నిలబడి.. మరో కాళ్లతో దాన్ని బ్యాలెన్స్ చేశాడు. ఇక ఈయన జిమ్ముల్లో చేస్తున్న వర్కవుట్ ల వీడియోలు కూడా బాగా వైరల్ గా మారాయి.