అత్తి పండు తింటున్నారా అయితే వీరికి ఎంత ప్రమాదమో చూడండి?

పండ్లలో ఎన్నో రకాల మేలు చేసే పనులు ఉంటాయి. ముఖ్యంగా మంచి ఇమ్యూనిటీపవర్ పెంచే పండ్లు కూడా చాలా ఉన్నాయి. కాలంలో దొరికే పండ్లతో కాకుండా మిగతా పండ్లలో కూడా చాలా ప్రోటీన్లు ఉంటాయి. అందులో అత్తిపండు (అంజీర్) కూడా ఒకటి. ఈ పండు తినడం వల్ల శరీరానికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

అంతేకాకుండా ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఇందులో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పండును ఎవరు పడితే వాళ్ళు తినకూడదు అని తెలిసింది. గ్యాస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ పండును తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసింది.

ఇక నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం జరిగే వాళ్ళు ఈ పండు ని అస్సలు తీసుకోకూడదు. మైగ్రేన్ సమస్యలతో బాధపడే వాళ్లు కూడా ఈ పండుకు దూరంగా ఉండాలి. ఈ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపానికి దారితీస్తుంది. కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ పనులు తీసుకోవద్దని తెలిసింది. ఎందుకంటే ఈ పండులో ఉండే ఆక్సలేజ్ మరింత సమస్యను తెచ్చిపెడుతుందని తెలిసింది.

కానీ చాలా మంది ఈ పండును తినడానికి ఇష్టపడుతుంటారు. అరుదుగా దొరికే ఈ పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కూడా కొన్ని కొన్ని సార్లు ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ పండ్లకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు కూడా తెలుపుతున్నారు. కాబట్టి ఈ పండ్లను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *