జగన్ తో కలిసి నడుస్తాం : నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు..!

సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే టీడీపీ పక్షాన ప్రత్యేక హోదా కోసం కలిసి నడుస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. గుంటూరులోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అనుభవిస్తూ ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయలేదని విమర్శించారు. హోదా ఇస్తామని మాట తప్పిన మోదీకి ఇది సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో(కాంగ్రెస్) కలిస్తే ఏపీకి న్యాయం జరుగుతుందని చంద్రబాబు భావించారని…అందుకే కలిసి ప్రభుత్వంలో చేరి ముందుకు నడిచామని తెలిపారు.

జగన్ తో కలిసి నడుస్తాం : నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలిగిందన్నారు. 2014లో తమతో కలిసి ప్రచారం చేసి.. ఏపీకి న్యాయం చేస్తాం అన్నారని గుర్తుచేశారు. హోదా పదేళ్లు కావాలన్న బీజేపీ పెద్దలు కూడా మాట్లాడాలని కోరారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని జగన్ చెప్పారని, ఈ మూడేళ్లలో సీఎం చేసిందేమిటో… చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా ఏపీకి న్యాయం జరగలేదన్నారు. గాయం తీవ్రత తగ్గకపోగా.. పుండు మీద కారం జల్లిన చందంగా మోదీ ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు.

మెడలు వంచుతామన్నోళ్లు మోదీ దగ్గర సాగిలపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులు తొలగించుకునేందుకు దించిన మెడను ఎత్తడం లేదని ఎద్దేశా చేశారు. వైసీపీ నాయకులా… మా గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. టీడీపీ నాడు బయటకు వచ్చి ఎలా పోరాడిందో అందరికీ తెలుసన్నారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలని అన్నారు. మోదీ మోసం తెలుసుకుని పొత్తు నుండి బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *