పూజా హెగ్డే కొత్త ఇంట్లో టీవీ.. నెక్స్ట్ లెవెల్ అంటూ సందడి!

Pooja Hegde : టాలీవుడ్ ప్రేక్షకులకు పూజా హెగ్డే గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆపై పలు స్టార్ హీరోల సరసన నటించి నకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీ తన అందం తో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలిచింది.

 Pooja Hegde
Pooja Hegde

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్న ఈ భామకు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫేమ్ తెచ్చిపెట్టినట్లే కనిపిస్తుంది. ఇక ఈ భామకు కోలీవుడ్ ప్రేక్షకులతో కూడా మంచి రాపో ఉంది. పూజ సోషల్ మీడియాలో కూడా బాగా సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అందమైన పోస్టులు పంచుకుంటూ అభిమానులను మురిపిస్తుంది.

ఇక ఇటీవలే పూజ ముంబై లో కట్టిన లగ్జరీ హౌస్
గురించి నెట్టింట్లో తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు ఒక సంవత్సరం నుంచి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టింది. మొత్తానికి ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి కొత్త ఇంట్లో టీవీని సెట్ చేసింది. సోనీ కంపెనీకి చెందిన ఆ టీవీ ఆన్ చేస్తూ పూజా తెగ సంబరపడిపోతూ ఉంది.

దానికి సంబంధించిన పోస్ట్ ను పూజ తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. జెడి మైండ్ ట్రిక్స్ ఇందులో ఉన్నాయి. అంటూ ఆ టీవీలో పలు ఎక్స్ట్రా ఫీచర్ గురించి మెన్షన్ చేసింది. ఇక అంతే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంటూ పూజ తెగ మురిసిపోయింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *