చందాలు వేసుకుని టీడీపీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం : మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు తెలంగాణ లో కూర్చుని ఏపిలో పాలనపై బురద జల్లుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. వైసీపీని, సిఎం జగన్ మోహన్ రెడ్డిని కించ పరిచేందుకు మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.  2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారని, ఈ సారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.

చంద్రబాబు, టీడీపీకి మాత్రమే ఇది సైకో పాలనలా కనిపిస్తోందని, టీడీపీకి మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో 14 సంవత్సరాలు పాటు సైకో పాలన సాగిందని, డబ్బులతో ఎన్నికలకు వెళ్ళే సంస్కృతి టీడీపీదేనని, వైసీపీలో అలాంటి సంస్కృతి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ టీడీపీని అధికారం లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక ఏ కుటుంబమూ ఆర్థికంగా చితికి పోకుండా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.

కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని, ప్రతి పిల్ల వాడు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా, ప్రతి పేషంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా నాడు నేడు తో ఆదునికరిస్తున్నామని పేర్కొన్నారు.  కడుపులో ఉన్న బిడ్డ నుండి అవ్వాతాతల వరకు అందరికీ ఆర్థిక అండ లభిస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని అమ్మఒడి, సచివాలయం వువస్థ ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాల అధికారులు సైతం ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమం పై అధ్యయనాలు చేస్తున్నాయన్నారు. 14 ఏళ్లలో మీరు ఇంత గొప్ప గా ఏమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *