సమంత వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన నటుడు సిద్ధార్థ్… ఫ్యాన్స్ ను పెంచి పోషిస్తున్నావా అంటూ!

సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.విడాకుల ప్రకటన తర్వాత సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం ద్వారా స్పందిస్తూ ఉంటారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత తన గురించి ఇంత దారుణమైన కామెంట్లు చేశారు. వాటన్నింటిని భరిస్తూ ఎంతో ధైర్యంగా ఉన్నానని సమంత తాజాగా వెల్లడించింది. తన కెరీర్ ని ఎంతో కష్టపడి నిర్మించుకున్నానని అయితే ఈ ఏడాది తన కలలు శిథిలమై పోయాయని ఎంతో ఇష్టంగా ఈ ఏడాది గడిచింది అంటూ ఈమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే సమంత తన జీవితానికి రిలేటెడ్ గా ఉండేలా నిత్యం ఏదో ఒక పోస్టు ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు.ఇలా ఆమె వ్యక్తిగత విషయాల గురించి సమంత తెలియజేస్తూ ఉంటే కొందరు సమంతకు మద్దతు తెలపగా మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఆమెను అవమాన పరుస్తున్నారనీ సమంత వెల్లడించింది.

సమంత చేసిన ఈ పోస్టుకు నటుడు సిద్ధార్థ ఘాటుగా స్పందించారు. నేటి టాక్సిక్ సోషల్ మీడియా ప్రపంచంలో స్టార్స్ ఫాన్స్ ను పెంచి పోషిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకోవడం కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారని తాము పెంచి పోషించిన అభిమానులే చివరికి కాటేస్తాయని వారిని గుర్తించుకోవాలి ఉందంటూ ఈమెను హెచ్చరిస్తూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *