సిద్ధు జొన్నలగడ్డకు ఎదురైన బోల్డ్ ప్రశ్న.. రియాక్ట్ అయిన హీరోయిన్!

Sidhu Jonnalagadda: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ గురించి అందరికి తెలుసు. ‘గుంటూరు టాకీస్’ సినిమా ద్వారా అందరికీ గుర్తుండిపోయిన ఈ యాక్టర్ పలు సినిమాలలో సైడ్ యాక్టర్ గా నటించి తన నటనకు గాను ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డీజే టిల్లు సినిమాతో థియేటర్లో హడావిడి చేయబోతున్నాడు ఈ కుర్ర హీరో.

Sidhu Jonnalagadda
Sidhu Jonnalagadda

ఇక డీజే టిల్లు ట్రైలర్ నిన్న అనగా బుధవారం నాడు విడుదల చేయగా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ ఈవెంట్ లో డీజే టిల్లు కు ఒక ఒక ప్రశ్న ఎదురైంది. ఈ ట్రైలర్ లో ఉన్న పుట్టుమచ్చల సీన్ గురించి రిపోర్టర్ బోల్డ్ గా ఒక ప్రశ్న వేశాడు. ‘సినిమాలో డైలాగ్ చెప్పారు కదా? నిజంగానే ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా.. అని రిపోర్టర్ అడిగాడు.

ఇక ఈ ప్రశ్నను సిద్దు జొన్నలగడ్డ కాస్త అసౌకర్యంగా ఉండి దాటవేశాడు. కానీ ఆ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి మాత్రం ఆ ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసి ఆ రిపోర్టర్ పై ఇలా స్పందించింది. “ట్రైలర్ ఈవెంట్లో అలాంటి ప్రశ్నలు అడగడం చాలా దురదృష్టకరం. దీన్ని బట్టి ఆ రిపోర్టర్ చుట్టు పక్కల ఉండే మహిళలను, ఇంట్లో ఉండే వారిని ఎలా గౌరవిస్తాడో అర్ధమవుతుంది.” అని నేహా శెట్టి తన దైన స్టైల్లో రియాక్ట్ అయ్యింది. ఏదేమైనా ఈ ట్రైలర్ చుసిన తరువాత ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా భారీ ఎత్తున సక్సెస్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *