దాబాను సీజ్ చేసిన అధికారులు

నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ వద్ద గల వెంగమాంబ పంజాబీ డాబాను సోమవారం రాత్రి మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ సీజ్ చేశారు. డాబాను తనిఖీ చేసిన ఆయన లైసెన్స్ లేకుండా నిర్వహిస్తూ నిల్వ ఉండిన పదార్థాలను వడ్డిస్తున్నట్టు గమనించారు. దీంతో లైసెన్స్ లేకుండా నడపడం సమంజసం కాదని సీజ్ చేశారు. లైసెన్స్ పొందిన తర్వాత నిబంధనల ప్రకారం తాజా పదార్ధాలను వడ్డిస్తూ నడుపుకోవాలని తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *