కులోన్మాదంతో వైసీపీ దహించుకుపోతుంది :  గోరంట్ల బుచ్చయ్యచౌదరి

తూర్పు గోదావరి జిల్లా సర్పవరం సబ్ ఇన్ స్పెక్టర్ ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకు అవమానం అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేశాారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. సమర్థత, సీనియారిటీ  ఆధారంగా పోస్టింగ్ లు ఇవ్వాల్సిన కీలక శాఖలో కులాల వారీ ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అనైతికం అని అన్నారు. గర్వంగా పోలీసు యూనిఫాం వేసుకుని విధులు నిర్వర్తించే ఒక అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

దీనికి డీజీపీ ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నిచారు. కులం, మతం కంటే సమర్ధులకే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ పట్టం కట్టి గౌరవించేదని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎంఓలో కీలక స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి నాటి పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేష్  దగ్గర పని చెయ్యలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం జగన్ దగ్గర ఉన్న అజయ్ కల్లాం రెడ్డికి టీడీడీ ఈవోగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు అవకాశాలు ఇవ్వలేదా? అని అడిగారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కులం కారణంగా వందల మంది పోలీసు అధికారులకు గత రెండు, మూడేళ్లుగా పోస్టింగులు నిలిపివేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చెయ్యని తప్పుకు జీతాలు లేకుండా పోలీసుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని, తండ్రిని కోల్పోయిన గోపాలకృష్ణ పిల్లల ఉసురు తగిలి కులద్వేషంతో రగిలిపోతున్న వైసీపీ ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయం అని దుయ్యబట్టారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *