కేటీఆర్ ఏపీకి వస్తే బాబాయిని చంపిన బాత్రూం చూపిస్తారా? : టీడీపీ

దేశంలోకెల్లా చేతకాని పాలకుడు ఎవరంటే జగన్ అని ప్రజలు చెప్పుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. జగన్ చేతకాని పాలనతో రాష్ట్రం పరువుపోతోందని, తెలుగు జాతి అపహాస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కరెంట్, నీళ్లు అభివృద్ది లేదని ఒక్క కేటీఆర్ కాదు, దేశంలోని మెజార్టీ ప్రజలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ వాస్తవాలు చెపితే సహించలేని వైసీపీ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ ఏపీకొస్తే అభివృద్ది చూపిస్తామని వైసీపీ నేతలు అనటం హాస్యాస్పదం అన్నారు.

‘‘కేటీఆర్ ఏపీకొస్తే   రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరెంట్ లేక  సెల్ ఫోన్ లైట్  వెలుతురులో  వైద్యం చేయటం చూపిస్తారా?’’ లేక 3 ఏళ్ల వైపీపీ పాలనలో దుర్మార్గుల చేతిలో అఘాయిత్యాలకు బలైన మహిళల ఫోటోలు చూపిస్తారా? లేక ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డ నిరుద్యోగ యువత సమాధులు చూపిస్తారా? ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందక బలవర్మణాలకు పాల్పడ్డ రైతన్నల కుటుంబాల కన్నీళ్లు చూపిస్తారా? లేక అమరావతి ప్రాంతంలో మెలిచిన పిచ్చి మెక్కల్ని చూపిస్తారా?

జగన్ రెడ్డి  కమీషన్లకు తట్టుకోలేక పొరుగు రాష్ట్రాలకు పారిపోయిన కంపెనీల లిస్ట్ చూపిస్తారా? రూ. 5 అన్నం పెట్టడం చేతకాక మూసేసిన అన్న క్యాంటీన్లు చూపిస్తారా? కూల్చివేసిన ప్రజావేధికను చూపిస్తారా? టీడీపీ హయాంలో 70 శాతం పూర్తయి..3 ఏళ్లలో కనీసం 7 శాతం కూడా పూర్తికాని పోలవరాన్ని చూపిస్తారా ?  రాజధాని పేరుతో విశాఖలో చేసిన భూ కబ్జాలు చూపిస్తారా? ద్వంసం చేసిన దేవాలయాల్ని చూపిస్తారా లేక తగులబెట్టిన రధాలు చూపిస్తారా?  లేక జగన్ రెడ్డి కొత్తగా తెచ్చిన నాసిరకం మద్యం బ్రాండ్లు చూపిస్తారా?’’ అని విమర్శించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *