చంద్రబాబు హయాంలో ఏం గాడిదలు కాశావా పవన్? : మంత్రి శంకర్ నారాయణ

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అన్ని బాధిత కుటుంబాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకుని ఒక్కొ కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. చనిపోయిన 469 మంది రైతులకు చంద్రబాబు చిల్లిగవ్వ సాయం కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిహారం అందించారని గుర్తు చేశారు.

చంద్రబాబుకు ఉన్న బినామీల్లో పవన్‌ కల్యాణ్‌ ఒకడని ఆరోపించారు. సినిమా షూటింగ్‌లు లేనప్పుడే పవన్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రైతుల గురించి పవన్ ఏం తెలుసని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పవన్‌కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. పవన్‌ పరామర్శించిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడో ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కోసమే తీసుకువచ్చారన్నారు. వ్యవసాయంపై పవన్ కు అవగాహన లేదని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల గురించి పవన్ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు హయాంలో గాడిదలు కాశావా అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, కౌలు రైతులకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. పవన్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లడం సమంజసం కాదని హితవు పలికారు. రాష్ట్రాన్ని సంక్షేమంలో నడిపిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *