జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన బ్యాంకింగ్ కష్టాల పై స్పందించారు. కర్నూలులో గత మూడు రోజులుగా తన డబ్బులు తాను తీసుకోవడానికి కుదరక ఎస్.బి.ఐ. బ్యాంక్ లో మరణించిన బాలరాజు కుటుంబ సభ్యులకు ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలియజేసారు. ఈ సందర్భంగా కేంద్రం లోని ఎంపీలంతా ప్రజల కష్టాలకు సంఘీభావం తెల్పడానికి బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడితే బాగుంటుందని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బీజేపి ఎంపీలు కూడా ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర నిలబడి క్యూలలో ఉన్న వారికి తమవంతు మద్దతు ప్రకటిస్తే ప్రజలకి కాస్త ధైర్యంగా ఉంటుందని తెలిపారు.
Andhra Pradesh

Leave a Reply