మిల్కీబ్యూటీ తమన్నా అవకాశాల వేటలో వెనుకబడిపోతోంది. ఈ ఏడాది తమన్నా అంగీకరించిన సినిమాలు కొన్ని విడుదలైపోయాయి. ‘బాహుబలి-2’, విశాల్ ‘ఒక్కడొచ్చాడు’ చిత్రాల షూటింగ్లు పూర్తయిపోయాయి. అయినా ఒక్క శింబు సినిమా తప్ప మరే సినిమాకూ తమన్నా పేరు వినబడ్డం లేదు. తెలుగులో తమన్నాను పట్టించుకోవడమే లేదు. ప్రస్తుతానికి తెలుగు టాప్ హీరోలందరూ రకుల్ ప్రీత్ సింగ్, శృతీహాసన్, కాజల్ చుట్టూనే తిరుగుతున్నారు. దీనికి కారణం తమన్నా ఆటిట్యూడ్ ప్రాబ్లమే అంటున్నారట నిర్మాతలు. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత తమన్నా ప్రవర్తనలో మార్పు వచ్చిందట. ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్తోపాటు, ఆమె స్టాఫ్కు కూడా రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాల్సి రావడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత తమన్నా పెట్టే కండీషన్లు కూడా మారాయట. అందుకే అన్ని భాషల నిర్మాతలూ తమన్నాను సైడ్ చేస్తున్నారట .
Entertainment

Leave a Reply