సమస్యలు పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతాం

ఎన్నో ఏళ్లగా కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగుతున్న తమ విధులను రెగ్యులర్ చేసి జీవిత భద్రత కల్పించాలనే డిమాండ్ తో పాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోనే పలు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా, ఇంటర్ విద్యా కమీషనర్ లకు పోస్ట్ కార్డులు పంపారు. తమ నిరసనల్లో భాగంగా ఈ నెల 28 న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట ధర్నా, డిసెంబర్ 1 న ‘ఛలో విజయవాడ’, తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు అధ్యాపకులు స్పష్టం చేసారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *