యూనివర్శిటీ అక్రమాల పై ఫిర్యాదును ప్రభుత్వ పరిశీలనకు పంపిన నారా లోకేష్

విక్రమ సింహపురి యూనివర్సిటీ అవినీతి అక్రమాల పై, వర్శిటీ లో కొనసాగుతున్న కుల వివక్ష, రిజిస్ట్రార్ శివశంకర్ అక్రమాలు మరియు క్రింది స్థాయి ఉద్యోగుల పై వేధింపుల పై రూపొందించిన బుక్ లెట్ ను ఇటీవల జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఇచ్చి ప్రభుత్వం తరపున విచారణ జరపాలని ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పాముల హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన నారా లోకేష్ పరిశీలించాల్సిందిగా ఆయన కార్యాలయ సిబ్బందికి అందజేసారని, అందులో భాగంగా నారా లోకేష్ కార్యాలయం నుండి ఫిర్యాదును 39517 నెంబర్ తో నమోదు చేసినట్లు ప్రభుత్వానికి పరిశీలనకు పంపినట్లు సమాచారం అందిందని తెలిపారు.యూనివర్శిటీ విషయంలో ప్రభుత్వం స్పందించి ప్రక్షాళన చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *