నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బంద్ లో కాంగ్రెస్

నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు పిలుపిచ్చిన బంద్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ పాల్గొంది. బంద్ లో భాగంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ నోట్ల రద్దు అనేది ప్రధాని మోడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయమన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం రద్దు చేసిన నోట్లని పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. నోట్ల రద్దుని ఉపసంహరించుకుని పునరుద్ధరించకుంటే పరిస్థితులు ఇంకా తీవ్రంగా మారిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య, పిసిసి కమిటీ నేతలు చేవూరి దేవకుమార్ రెడ్డి, చెంచలబాబుయాదవ్, సి.వి.శేషారెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉడతా వెంకట్రావ్, శివాచారి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *