ఎలా చనిపోతావో చెప్పేస్తా అంటున్న ప్రభాస్‌.. ట్రైలర్‌ చూశారా?

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. కానీ ఈసారి సమ్మర్‌లో ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం పక్కా అంటున్న మేకర్స్. కాస్త ఆలస్యంగానే ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ వరసగా అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. వాలంటైన్ డే రోజున గ్లిమ్ప్స్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్ యూనిట్ ఆ తర్వాత ఈ రాతలే వీడియో సాంగ్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశారు. ఒకపక్క ఇంటర్వ్యూలు కూడా మొదలు పెట్టిన మేకర్స్ ఏకంగా అభిమానులకు పండగ చేసుకొనేందుకు తాజాగా మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాల్ని పెంచగా తాజా ట్రైలర్‌ వాటిని రెట్టింపు చేసేలా ఉంది. గత ప్రచార చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఈ ట్రైలర్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది.  70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మించిన చిత్రమిది. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *