రికార్డు క్రియేట్ చేసిన మహేశ్‌ పాట‌.. మేకింగ్‌ వీడియో చూశారా!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. ఫిబ్రవరి 13న ఈ సినిమా నుంచి కళావతి సాంగ్‌ రిలీజైంది. ఈ ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయా.. ఏందే నీ మాయ.. అంటూ సాగే లిరిక్స్‌ సంగీతప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటివరు ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్‌ రాగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. సెన్సేషనల్‌గా మారిన ఈ హిట్‌ పాటకు తమన్‌ సంగీతం అందించగా సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో మహేష్ మరింత్ స్టైలిష్ లుక్‏లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్.. సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సాంగ్‌ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో చిత్రయూనిట్‌ మహేశ్‌, కీర్తి సురేశ్‌ ఫన్నీ మూమెంట్స్‌ను చూపించారు. ఈ వీడియోలో వీరిద్దరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మహేష్, డైరెక్టర్ పరశురామ్ ఫన్నీగా గడిపినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇక మహేశ్‌ అభిమానులు ఈ మేకింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు.

mahesh babu kalavathi song making video

ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ మాత్రమే కాదు.. సంగీత దర్శకుడు తమన్, గాయకుడు సిద్ శ్రీరామ్, ఇతర వాద్యాకారులతో కూడా కలర్‌ఫుల్‌గా పాటను చిత్రీకరించారు. ఈ పాటలో కనీసం 2 నిమిషాలు వీరంతా కనిపించి ఉంటారు. దీని కోసం సుమారు రూ.60 లక్షలు ఖర్చు పెట్టారని టాక్‌ వినిపిస్తోంద. అయితే, వారి కష్టం ఏదీ వృథా కాలేదు. కానీ, యూట్యూబ్‌లో రిలీజ్ కంటే ముందే ఈ పాట బయటకు లీకైపోయింది. వేరే దారి లేకపోవడంతో ఈ పాటను చెప్పిన రోజు కంటే ముందే విడుదల చేయాల్సి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *