ఆయనతో సమానంగా కడప జిల్లా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు- జగన్​

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. ఆయన కుమారుడిగా తనను కడప ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ అన్నారు. కడప జిల్లాలో వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా పర్యటించిన ఆయన.. ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్​ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ. 515 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రొద్దుటూరులో 30 నెలల్లో ప్రజలకు 320 కోట్లు బదిలీ చేశామని అన్నారు. సుమారు 22,212 మంది అక్కా చెల్లెల్లకు ఇళ్ల స్థలాల కోసం 200 కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.

jagan-speech-at-proddutur

వీటితో పాటు 515 కోట్లతో ప్రొద్దుటూరులో అభివృద్ది పనులకు శంకుస్థాపనతో పాటు, పట్టణంలోని మైనారిటీలకు ఉర్దూ డిగ్రీ కళాశాల, ఎల్లా ఆంజనేయ స్వామి ఆలయ ఆధునీకరణకు నిధులు మజూరు చేసినట్లు జగన్​ సభాముఖంగా తెలియజేశారు.  మరోవైపు ఇటీవలే సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు జగన్​.

గత నెలలో మునుపెన్నడు లేని విధంగా రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేసిపడేశాయి. కడప జిల్లాలోనూ విపరీతమైన వర్షాల కారణంగా చాలా పంటనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అనేక మంది నివసించేందుకు కూడా చోటు లేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ క్రమంలోనే వారికి అండగా ఉటానని జగన్ హామీ ఇచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *