ఎఫ్ 3 సినిమా వాయిదా.. దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

Dil Raju: టాలీవుడ్ ప్రేక్షకులకు నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘దిల్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నిర్మాత.. ఆపై పలు చిత్రాలు నిర్మించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అగ్ర స్థాయి నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఆర్య, భద్ర , నేనూ లోకల్, ఫిదా వంటి సినిమాలకు నిర్మాతగా వహించాడు దిల్ రాజ్. ఇక ఇటీవలే విడుదలైన ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని కూడా దిల్ రాజునే నిర్మించాడు. ఈ సందర్భంగా శనివారం  హైదరాబాదులో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ “వచ్చే నెల మూడో వారం నుంచి కరోనా ప్రభావం తగ్గి  సినిమాలు విడుదల అవుతాయని ఆశిస్తున్నాం.

ప్రస్తుతం పరిస్థితుల వల్లనే ‘త్రిబుల్ ఆర్’ రెండు విడుదల తేదీలను ప్రకటించాల్సి వచ్చింది. ఒకవేళ  పరిస్థితుల కారణంగా మార్చి 18న త్రిబుల్ ఆర్ విడుదల కాకుండా ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ‘ఎఫ్ త్రీ’ సినిమా వాయిదా పడవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి.

అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల గురించి పరిష్కారం ఇస్తుందని అనుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం నియమించిన సిఫార్సుల పై ఆధారపడి నిర్ణయాలు ఉంటాయి’ అని దిల్ రాజు తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *