ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడే ప్రయత్నం : టీడీపీ ఎం.ఎస్ రాజు

తన డ్రైవర్ సుబ్రమణ్యం అనే దళితుడి హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్ రాజు విమర్శించారు.  మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హంతకుడైన అనంతబాబును కాపాడటమే జగన్ రెడ్డి విధానమా? అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ పూర్తైనా ఇప్పటి వరకు పిటీషన్ ఎందుకు దాఖలు చేయలేదు? వైసీపీ నుంచి మోసకారి సస్పెన్షన్ చేసి హంతకుడిని అన్ని విధాల కాపాడుతారా? జైల్లో హంతకుడిని పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

అనంతబాబు ఒక హంతకుడు. దళిత వర్గాల వ్యతిరేకి. అనంతబాబును కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తుంది. అందుకే హత్య జరిగిన వారం రోజుల అనంతబాబును దాచిపెట్టి అరెస్టు చేయలేదు. అనంతబాబు తప్పు చేయలేదు గనుకనే దర్జాగా ప్రజల్లో తిరుగుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ నిస్సిగ్గుగా సమర్ధించాడు. దళిత సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ధర్నాలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేసి డ్రైవర్ సుబ్రమణ్యం తిరగబడ్డాడని ఆత్మరక్షణ కోసం నెట్టాడనే కట్టుకథలు అల్లారు. ఇప్పుడు అనంతబాబుకు 14 రోజులు రిమాండ్ ముగిస్తున్నా కనీసం పిటీషన్ కూడా ధాఖలు చేయలేదు.

అంటే జగన్ రెడ్డి పార్టీ నుంచి అనంతబాబును సస్సెండ్ చేసింది కేవలం దళిత వర్గాలను శాంతింపచేయడానికే అని స్పష్టంగా అర్ధమౌతుంది. పరోక్షంగా అనంతబాబును బయటికి తీసుకురావడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోంది. అనంతబాబుకు జైల్లో అన్ని రాచమర్యాదలు జరుగుతున్నాయి. ప్రత్యేక రూం, బెడ్, పుడ్ ఏర్పాట్లు చేశారు. 14 రోజుల రిమాండ్ లో జైల్లో మరో ఖైదీపై అనంతబాబు దాడి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి కనుసన్నల్లో వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు.’’ అని ఆరోపించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *