అన్ని వర్గాల వారికి అన్యాయం చేసేందుకు జగన్ ప్రయత్నం​- చింతమనేని

ఆంధ్రప్రదేశ్​లో ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ ఆధ్వర్యంలో తేదెపా నేతలు ఓటీఎస్​ను రద్దు చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

jagan-is-exploiting-people-from-all-walks-of-life-said-chintamani-prabhakar

ఈ సందర్బంగా చింతమనేని మాట్లాడుతూ.. సీఎం జగన్ అన్ని వర్గాల వారిని దోపిడీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం ఓటీఎస్​ సెటిల్​మెంట్ కాదని.. ఓజేడీ(ఒక్కసారి జగన్​మోహన్ రెడ్డి దోపిడీ) అంటూ ఎద్దేవా చేశారు. పేవారికి పక్కా హక్కులతో ఇళ్లు కేటాయిస్తామని ఈ పద్దతిని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, పరిస్థితి చూస్తుంటే.. త్వరగా ఇళ్లు అమ్మేసి తాగి నెత్తిన పోసికోండని అన్నట్లు జగన్​ పాలన ఉందని విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే లబ్దిదారులకు నయాపైసా ఖర్చు లేకుండా హక్కులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అధికారులకు, వాలంటీర్లకు ఎవ్వరూ తలదించుకుని బతకాల్సిన అవసరం లేదని అన్నారు చింతమనేని.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *