దారుణం.. తల నరికి అమ్మవారి ఆలయం వద్ద ఉంచి..ఆ తరువాత?

Crime News: సమాజంలో రోజురోజుకీ హత్యలు,అత్యాచారాల ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మానవత్వం అన్న మాట మరచి కొందరు అతి దారుణంగా ఎదిగి వ్యక్తులను చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఇంకొందరు అయితే ఎదుటి వ్యక్తి ఎవరు అన్నది గుర్తుపట్టలేని విధంగా వారిని హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కర్ణాటక లోని భాగలూరు ఈ ప్రాంతంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది.

Crime News
Crime News

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడు తల నరికి దారుణంగా హత్య చేయడంతోపాటు అనంతరం ఆ తలను స్థానికంగా ఉన్న మారియమ్మ ఆలయం వద్ద ఉంచి మొండాన్ని సమీపంలోని చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. కర్ణాటక రాష్ట్రంలోని హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువ పల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కుమారుడు ప్రదీప్ కు చంద్రిక అనే యువతితో వివాహమైంది. దంపతులకు ఇద్దరు సంతానం. ఇక చంద్రిక మూడవ సారి గర్భం దాల్చడంతో ప్రసవం నిమిత్తము తన పుట్టింటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రదీప్ అందరికీ అదే ప్రాంతంలోనే అమ్మవారి గుడి దగ్గర పడేసి వెళ్లిపోయారు.

ఇక స్థానికుల సమాచారం మేరకు స్థలానికి చేరుకున్న పోలీసులు మొండెం కోసం గాలించగా సమీపం ముళ్లపొదల్లో మొండెం లభ్యమయింది. ఇక అనంతరం హత్యకు గల కారణాలు గురించి విచారించగా ప్రదీప్ కు అదే ప్రాంతానికి చెందిన సంతోష్, మురళి అనే బంధువులతో గత 15 ఏళ్లుగా ఆస్తి ఈ విషయంలో తగాదాలు ఉన్నాయని, ఈ హత్యలు వాళ్ళే చేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ప్రదీప్ మరణవార్త తెలుసుకున్న అతని భార్య చంద్రిక గుండెలవిసేలా రోదిస్తోంది..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *