పన్నెండేళ్ల తర్వాత కలిసి నటించనున్న రజనీ-ఐశ్వర్య..!

రజనీకాంత్, బాలీవుడ్ భామ ఐశ్వర్యారాయ్ జోడీగా 2010లో వచ్చిన ‘రోబో’ సినిమా ఓ రేంజ్‌లో హిట్ అయిన సంగతి తెలిసిందే. రజనీ యాక్షన్, ఐశ్వర్య అందం, దర్శకుడు శంకర్ గ్రాఫిక్స్ మాయాజాలం అన్నీ కలిసి ఈ చిత్రానికి ఘన విజయం అందించాయి. ‘రోబో’ విడుదలై ఇప్పటికి 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

rajinikanth and aishwarya rai can be seen together again on screen after 12 years

రోబో తర్వాత రజనీకాంత్ నటించిన రోబో 2.0 తో సహా కబాలి, కాలా, పేట, దర్బార్, అణ్ణాత్త సినిమాలు ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. వరుస ఫ్లాప్స్ వస్తున్న కారణంగా కోలీవుడ్ హీరో అజిత్‌కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ శివతో అణ్ణాత్త చేసిన రజనీ, సాలీడ్ హిట్ కొట్టాలనుకున్నారు. కానీ, అది సాధ్యపడలేదు. ఈ సినిమా కనీసం అభిమానులను కూడా తృప్తి పరచలేకపోయింది. ఇక రజనీ సినిమాలకు దూరం కానున్నారని ఈ మధ్య అంతటా ప్రచారం జరుగున్న నేపథ్యంలో మళ్ళీ రెండు సినిమాలను చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  వాటిలోని ఒక సినిమాలో రజనీ, ఐశ్వర్య జంటగా నటించనున్నారట.

rajinikanth and aishwarya rai can be seen together again on screen after 12 years

ఇక రజనీ, ఐశ్వర్యల తాజా చిత్రానికి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. మరోవైపు రజనీకి ఇది 169వ చిత్రం కాబోతోంది. రజినీ- ఐశ్వర్య జోడీ మరోసారి మ్యాజిక్‌ను క్రియేట్‌ చేయడం ఖాయం అంటోంది కోలీవుడ్‌. త్వరలోనే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్‌ ప్రియాంకా అరుల్‌ మోహన్‌ కీలక పాత్ర చేయనున్నారని టాక్‌.   ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *