ధ్రువ సినిమాలో రాజశేఖర్ కు ఆ పాత్ర.. కానీ ఆయన ఒప్పుకోలేదు అంటూ జీవిత కామెంట్స్!

Rajasekhar And jeevitha: టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ హీరో రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే. ‘వందేమాతరం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆపై ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినీ నటి జీవితను ప్రేమ వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
వాళ్లను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

Rajasekhar And jeevitha
Rajasekhar And jeevitha

ఇదిలా ఉంటే ఈటీవీ లో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో కు గెస్ట్ లుగా హాజరైన జీవిత రాజశేఖర్ లు ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలో రాజశేఖర్, శేఖర్ మూవీ లో మొదట శివాని లేదని, అద్భుతం సినిమా సక్సెస్ సాధించడంతో శివాని సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందని తెలిపాడు రాజశేఖర్.

మనం ఏది చేస్తామో అది మళ్ళీ తిరిగి వస్తుందని దానిని నేను కర్మ అని నమ్ముతా అని రాజశేఖర్ అన్నారు. అదే క్రమంలో అంకుశం సినిమా షూటింగ్ లో రామిరెడ్డిని నిజంగానే కొట్టినట్టు చెప్పాడు. అంకుశం మూవీకి ఆ సీన్ బాగా హైలెట్ అయిందని తెలిపాడు. ఆ తర్వాత జీవిత మాట్లాడుతూ..

రామ్ చరణ్ ధ్రువ సినిమాలో అరవిందస్వామి చేసిన రోల్ రాజశేఖర్ కు ఇస్తే బాగుంటుందని సురేందర్ రెడ్డి ని అడిగానని కానీ ఆయన దీనికి ఒప్పుకోలేదని జీవిత చెప్పుకొచ్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన రాజశేఖర్ శేఖర్ సినిమా ట్రైలర్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులలో మంచి రెస్పాన్ వచ్చింది. ఇందులో రాజశేఖర్ సగం ముఖం తో మాత్రమే కనిపించాడు. చూడగా ఆయన వయసు కు తగ్గా పాత్రలో అయన చేస్తున్నారు అని తెలుస్తుంది.

.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *