పిల్లలకు ఊబకాయం రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం రాకుండా ఉండాలంటే చిన్నతనంలో తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు  వల్ల శిశువు ఇన్‌ఫెక్షన్లు, వాంతుల సమస్య, ఇతర చిన్న సమస్యలను నుండి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు కూడా తల్లులకు దూరమవుతుంది. బిడ్డ ద్వితీయ ఏడాదికి వచ్చాక తల్లిపాలు ఇవ్వడంతోపాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని జాతీయ ఆరోగ్య సేవాసంస్థ చెబుతోంది.

తల్లిపాల వల్ల బిడ్డలు అనారోగ్య చెందకుండా ఉంటారని ఆ సంస్థ చెబుతోంది. తల్లి నుండి తాగే పాలు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి కాబట్టి బిడ్డలకు ఉపకారం చేస్తాయి. బిడ్డ తాగినన్ని పాలు, తల్లి ఇవ్వగలిగినంత శక్తి ఉన్నంత వరకూ పాలు ఇవ్వవచ్చు.  శిశువుకు మొదటి ఆరు నెలలు ద్రవ, ఘన పదార్థాలు ఏమీ ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలతో పాటు ఘన పదార్థాలు తినిపించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు.

అయితే తల్లిపాలు రెండేళ్ల తర్వాత కూడా ఇవ్వడం వల్ల పోషకాలు పుష్కలంగా లభించి ఉపాంత ప్రయోజనం చేకూరుతుందని చెప్పలేమన్నారు.  రెండవ యేట శిశువుకు కావాల్సిన పోషకాలు తాను తీసుకొనే ఇతర ఆహారంతో అందించాలని చెప్తున్నారు. పాలు పట్టించడాన్ని కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయాన్ని చాలా కొన్ని మహిళలు నిర్ణయించుకుంటారు. వారి సౌకర్యం, ఇబ్బందులు, ఉద్యోగాల నిమిత్తం శిశువుకు పాలు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. కొన్ని ఇతర దేశాల్లో కొన్ని వారాల పాటు మాత్రమే పాలు ఇస్తారు. అయితే కొన్ని వారాల తర్వాత పాలు ఇవ్వడం మానేయడం వల్ల అనారోగ్యం పాలవుతారన్న గ్యారంటీ లేదని చెప్తున్నారు. తీసుకునే పదార్థాలను బట్టి పోషకాలు లభిస్తాయని చెప్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *