అదరగొట్టిన ‘ఆచార్య’ ట్రైలర్.. చిరు, చరణ్‌ల కాంబో చూశారా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ హంగామా మెుదలైంది. చిరుతో పాటు ఆయన వారసుడు రామ్ చరణ్ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. యూట్యూబ్‌లోకి లేటుగా వచ్చింది కానీ… థియేటర్లలో ముందుగానే విడుదలైంది. ఆల్రెడీ ట్రైలర్ చూసిన మెగాభిమానులకు తమకు సినిమా ఫుల్ కిక్ ఇచ్చేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు.

Chiru Acharya movie trailer release

మెగా అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ప్రారంభంలో రామ్ చరణ్, పూజా హెగ్డే జోడీని చూపించారు. దేవాలయాల్లో పూజలు చేసే వ్యక్తిగా చరణ్ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి ట్రైలల్‌లో కాస్త లేటుగా వచ్చినా… ఆయన ఎంట్రీ లేటెస్టుగా ఉంది. వీడియోలో చూపించిన ఈ ఇద్దరి లుక్స్‌, పవర్‌ఫుల్‌ నటన సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. దర్శకుడు తనదైన మార్క్‌ కథను చెప్పబోతున్నారని తెలుస్తోంది.

చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. సోనూ సూద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ నెల 24న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. చిరూ – చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *