రెండు చేతుల సంపాదనపై చిరు ఫోకస్​.. మరో ప్రాజెక్టుకు సైన్!

రెండు చేతుల సంపాదనపై మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ చేస్తున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తునే మరో వైపు యాడ్స్ లో కూడా కనిపించనున్నారు. ఇప్పటికే మెగాస్టార్ నటించిన ఆచార్య చిత్రం పూర్తిస్థాయిలో కంప్లీట్ అయ్యింది. దీనితో పాటే మరో సినిమాకు ప్లాన్ చేసిన ఆయన.. ఈ గ్యాప్ లో ఓ కమర్షియల్ యాడ్ చేసేందుకు ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అన్నయ్య మరోసారి ఫాంలోకి వచ్చారు అని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.

chiranjeevi going to act in a advertisement

చిరంజీవి గతంలో కూడా టీవీ యాడ్స్ లో కనిపించారు. థమ్స్ అప్, నవరత్నా ఆయిల్ లాంటి కంపెనీల ప్రకటనల్లో నటించారు. వాటికి తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అనంతరం సినిమాలను దూరం పెట్టి రాజకీయాల వైపు వెళ్లిన ఆయన.. ఈ క్రమంలోనే యాడ్స్ కు కూడా పుల్ స్టాప్ పెట్టారు. సుమారు 13 ఏళ్ల తరువాత మరోసారి ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో కనిపించనున్నట్లు సమాచారం. దీని కోసం ఆయన భారీగానే రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పటికే మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్కులను పూర్తి చేసుకుని విడుదల కు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, పూజాహెగ్దే కనిపించనున్నారు. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ. 140 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కిందని చిత్ర బృందం తెలిపింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *