అత్యాధునిక హంగులతో ముస్తాభై ప్రారంభమైన “ద సినిమా” – ఎం.జి.బి. మాల్ లో 5 స్క్రీన్స్

నెల్లూరు నగరంలో సినిమా థియేటర్ల కొరత తీరనుంది. ప్రముఖ సినిమా థియేటర్ల యాజమాన్య సంస్థ ఎస్.పి.ఐ సినిమాస్ వారి సినిమా చైన్ “ద సినిమా” మల్టీప్లెక్స్ కు సంబంధించిన 5 సినిమా స్క్రీన్స్ నగరంలోని ఎం.జి.బి ఫెలిసిటి మాల్ లో ఏర్పాటయ్యాయి. నేడు ఆ స్క్రీన్స్ లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. అతిధులుగా హాజరైన ప్రేక్షకులు తమ అనుభూతులను సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో విరివిగా పోస్టులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎస్.పి.ఐ సినిమాస్ సంస్థ ఇప్పటికే నగరంలో “ఎస్2 సినిమాస్” మల్టీప్లెక్స్ ను నిర్వహిస్తున్నది. ఇప్పుడు ఈ థియేటర్ల ఏర్పాటుతో నగర ప్రజలకు మరో వినోద ప్రధానమైన ప్రాంతాన్ని చేకూర్చినట్టు అయింది. లాంఛనంగా నేడు ప్రారంభం అయిన ఈ థియేటర్లలో జనవరి లో విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం “ఖైదీ నంబర్ 150” తొలి చిత్రంగా ప్రదర్శితం కానున్నట్లు సమాచారం. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *