ట్రోలింగ్స్‌పై శ్రుతిహాసన్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్..!

అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శ్రుతిహాసన్‌ వరుస ఫ్లాప్‌లను చవిచూసింది. కెరీర్ ప్రారంభంలో ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న ఈ అమ్మడు త‌ర్వాత తెలుగు, త‌మిళ‌, హిందీ ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. త‌ర్వాత మైకేల్ కోర్స‌లేతో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఆ స‌మ‌యంలో సినిమాల‌కు దాదాపు దూర‌మైంది. త‌ర్వాత బ్రేక‌ప్ కావ‌డం అన్నీ చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. బ్రేక‌ప్ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శ్రుతీ హాస‌న్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది.

sruthi hassan about trolling

టాలీవుడ్‌లో ఇటీవలే రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. అలాగే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న బాలయ్య 107 సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందట ఈ చెన్నై భామ.

తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్.. తాను ఎదుర్కొన్న ట్రోలింగ్స్ గురించి ఆస‌క్తిక‌ర‌ విషయాలు పంచుకుంది. తాను ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నింటితో పోలిస్తే ‘ప్రేమమ్‌’కు ఎక్కువ ట్రోలింగ్స్ ఎదుర్కొన్నానని చెప్పింది శ్రుతి. సూపర్‌ హిట్‌ మలయాళం రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో తన నటన ఏం బాలేదని, హీరో నాగచైతన్య కంటే శ్రుతి వయసులో పెద్దదానిలా కనిపిస్తున్నానని ట్రోల్‌ చేశారట. ‘ప్రేమమ్‌’ ఆఫర్‌ వచ్చినప్పుడు చేయకూడదనుకున్నా.. ఆ పాత్రని తన స్టైల్‌లో క్రియేట్‌ చేయాలని అనుకుని ఆ ప్రాజెక్ట్‌ ఓకే చేశానని చెప్పుకొచ్చారు. “నాకూ ‘ప్రేమమ్‌’ ఒరిజినల్‌ నచ్చింది. కానీ, ఏవిధంగానూ నేను సాయిపల్లవిలా ఉండను. అందుకే ఆమెలా నటించలేదు. అదృష్టం కొద్ది మా సినిమా హిట్‌ అవ్వటంతో నేనెంతో సంతోషించా” అని శ్రుతిహాసన్‌ తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *