మంచు విష్ణు పై నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ల్స్.. అసలు ఎందుకంటే!

Manchu Vishnu: సినీ ప్రేక్షకులకు హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరో అయినా తండ్రి మోహన్ బాబు ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ హీరో..పలు సినిమాల్లో నటించి స్టార్ ఇమేజ్ తన సొంత చేసుకున్నాడు. కామెడీ, యాక్షన్ చిత్రాలకు మంచు విష్ణు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Manchu Vishnu
Manchu Vishnu

ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు నెటిజన్ల ట్రోల్స్ వర్షంలో తెగ తడిసి పోయాడు. సినీ ఇండస్ట్రీ తరఫున ఫిబ్రవరి 10న చాలా మంది స్టార్ హీరోలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. టికెట్ రేట్ల విషయంలో జరిగిన వివాదాలకు బ్రేక్ ఇచ్చారు. మొత్తానికి ఒక అండర్స్టాండింగ్ కి వచ్చారు. ఇక మంచు విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన లేదని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు, మంచు విష్ణు చేసిన ఓవర్ యాక్షన్ ను నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. మా ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు?.. మంచు విష్ణు ను పిలవలేదా.. లేక వెళ్లలేదా? ఎక్కడున్నాడు అసలు ఏం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్టార్ హీరోలు వైయస్ జగన్ ని కలవడానికి వెళ్తున్న సమయంలో దిగిన ఫోటోను పంచుకొన్నాడు. అంతే కాకుండా దానికి ‘కన్నుల పండుగ’ అని కాప్షన్ కూడా ఇచ్చాడు నెటిజన్లు దీని గురించి కూడా కూడా ఓరేంజ్ ట్రోల్స్ నడుపుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *