Site icon 123Nellore

తనను అలా ఫీల్ అయ్యేలా చేయు అంటూ దానికి సిద్ధమే అంటున్న సమంత.. వైరల్ పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత ఏ విషయమైనా సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటుంది. తనకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా వెంటనే సోషల్ మీడియాను ముందుకు వేస్తుంది. ఇక ఈమధ్య సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. 2021 చివరిలో తను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యను విడిపోయిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ వరుస పోస్టులతో తనపై అందరి దృష్టిని తాకేలా చేస్తుంది. అమ్మ చెప్పింది అంటూ ఎన్నో ఎమోషనల్ కొటేషన్స్ ను షేర్ చేసుకుంది. నాగచైతన్య ఆలోచనలన్నీ దూరం కావటానికి సోషల్ మీడియా ద్వారా బాగా రీఫ్రెష్ అయ్యింది. ఇక మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగు పెట్టి వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో పోస్ట్ షేర్ చేసుకుంది. అందులో.. ఓకే యూనివర్స్.. అంటూ.. తాను మంచిని తీసుకునేందుకు, ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉన్నాను అంటూ.. తనను మంచిగా ఫీలయ్యేలా చెయ్యి అంటూ నేచర్ కు సంబంధించిన ఫోటోను పంచుకుంది.

ఇక ఆ పోస్ట్ వైరల్ గా మారగా.. కొత్త సంవత్సరం సందర్భంగా తాను ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది. ఇటీవలే తాను యశోద సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ను పూర్తి చేసింది. అంతేకాకుండా శాకుంతలం సినిమా కూడా పూర్తి చేసింది. ఇక బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version