Site icon 123Nellore

తన ప్రేమ, పెళ్లిపై రష్మిక ఏం చెప్పిందంటే..!

పుష్ప సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న నేషనల్‌ క్రష్‌ రష్మికా మందన.. ఇటు టాలీవుడ్‌ అటు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. తాజాగా తెలుగులో ఆమె న‌టించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. శ‌ర్వ‌నంద్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాను ఈనెల 25న విడుద‌ల చేయ‌డానికి సిద్ధం అయింది చిత్ర బృందం. తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌? అని చాలా మంది నన్ను అడుగుతున్నారని.. నిజానికి తాను ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదని రష్మికా చెప్పుకొచ్చారు. మనం ఎవరితోనైతే సంతోషంగా, సురక్షితంగా ఉంటామో వాళ్లనే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుందని ఆమె తన మనసులోని మాట బయటపెట్టారు. ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఒక‌రినొక‌రు స‌మానంగా అర్థం చేసుకుంటేనే ల‌వ్ అంటార‌ని.. తాను ఎవ‌రినైనా ల‌వ్ చేస్తే ఇంట్లో వారిని ఒప్పించిన త‌ర్వాతే మ్యారేజ్ చేసుకుంటాన‌ని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్ పైనే పెట్టినట్లు తెలిపింది రష్మికా మందన.

కన్నడలో తెరకెక్కిన కిర్రాక్‌ పార్టీ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన రష్మిక.. ఆ సినిమా హీరో రక్షిత్‌ శెట్టితోనే ప్రేమలో పడింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్లు ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండతో ర‌ష్మిక మంద‌న్నా ప్రేమలో ఉన్న‌ట్టు గ‌త కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ప్ర‌చారం అవుతున్న విషయం తెలిసిందే. కాగ దీనిపై ర‌ష్మిక స్పందించింది. విజ‌య్ త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మే అని చెప్పుకొచ్చింది.

Exit mobile version