Site icon 123Nellore

డైరెక్టర్ శంకర్ కు క్షమాపణలు చెప్పిన మహేష్..ఎందుకో తెలుసా!

Mahesh babu:-ప్రిన్స్ మహేష్.. ఈ పేరు సినీ ప్రపంచానికి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘రాజకుమారుడు’ సినిమా ద్వారా హీరోగా అడుగుపెట్టిన మహేష్. ఆ పై పలు సినిమాల్లో నటించి తన ప్రత్యేక ఆటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుత టాలీవుడ్ అగ్ర స్థాయి స్టార్ హీరో లలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగు వెలుగుతన్నాడు.

Mahesh babu

ఇదిలా ఉంటే మహేష్, డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు తెలిపినట్లు తెలిసింది. విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ ఈ షో శుక్రవారంతో పూర్తిచేసుకుంది. ఈ షో ఓటీటీ లో ఓ రేంజ్ లో ఊపందుకుంది. ఈ షో లో ప్రిన్స్ మహేష్ బాబు, డైరెక్టర్ రమేష్ పాల్గొని బాగా బాగా హడావిడి చేశారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు.

ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఓ సంఘటనను తెలియజేశాడు. ఒకసారి ముంబై మారిటన్ హోటల్ లో వాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేశాడు. దీని గురించి మహేష్ బాబు ఇలా చెప్పాడు ” ముంబైలో మారిటన్ హోటల్ లో మేము టిఫిన్ చేస్తుంటే ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్ఫీ అడిగారు. ఇప్పుడు కాదు ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పాను

దాంతో ఆ అమ్మాయిల అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత డైరెక్టర్ రమేష్ వాళ్లిద్దరూ శంకర్ గారి కూతుళ్లు అని చెప్పాడట. దాంతో మహేష్ పరిగెత్తుకొని కిందకి వెళ్లి సారీ సార్ మీ అమ్మాయిలు అని నాకు తెలియక అలా అన్నాను అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version