Site icon 123Nellore

ఈ ఏడాది గురించి భవిష్యత్తు చెప్పిన మాంత్రికురాలు.. ఏకంగా వాటిని గాల్లోకి ఎగిరేస్తూ మరి!

ఎవరికైనా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని బాగా ఆత్రుత ఉంటుంది. గత రెండు సంవత్సరాల నుంచి మాత్రం ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. కారణం గత రెండు సంవత్సరాల నుండి ప్రపంచం అల్లకల్లోలం కావడంతో వాటి నుండి ఎప్పుడూ ఉపశమనం పొందుతామో అని భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఏడాది ఏం జరుగుతుందో ఒక ఆవిడ ముందే చెప్పేస్తుంది. ఆమె పేరు జెమిమా ప్యాకింగ్ టన్. ఈమె ఒక ఆధునిక మాంత్రికురాలు. ఇదివరకే ఈమె చాలా విషయాల గురించి అన్ని నిజాలే చెప్పింది. చాలావరకు మాంత్రికులు భవిష్యత్తు గురించి ఏదో ఒక వాటిను ఉపయోగిస్తూ చెబుతారు. కొందరు జాతకాలను, ముఖం చూసి చెబుతుంటారు.

కానీ ఈవిడ మాత్రం అస్పరాగస్ కాడలను గాల్లోకి ఎగిరేసి మళ్లీ అవి కింద పడే విధానాన్ని బట్టి భవిష్యత్తు గురించి చెబుతుంది. అస్పరాగస్ అనేది ఒక రకమైన పువ్వులు. వీటిని విదేశాలలో మద్యం తయారీలో ఉపయోగిస్తారు. వీటి ఆధారంగా ఈ ఏడాదిలో ఏం జరుగుతుందో తెలిపింది. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ కంటిన్యూగా ఉంటారని తెలిపింది.

బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ కి ఇబ్బందులు ఎదురవుతాయని.. చాలా ఎదురు దెబ్బలు తగ్గుతాయి అని, కొన్ని కుంభకోణాలు ఆ కుటుంబాన్ని నలిపేస్తాయని తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ కప్పు గెలుస్తుందని తెలిపింది. ఈమె చెప్పినవన్నీ యూరప్ దేశానికి సంబంధించినవి. ఇక ఈ ఏడాదిలో జరిగే అనర్థాల గురించి మాత్రం ఏమి చెప్పలేదు.

Exit mobile version