Site icon 123Nellore

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం నుండి గుడ్ న్యూస్!

ఇటీవలే చిన్న పొదుపు పథకాల గురించి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం చిన్నతరహా పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించ లేదని తెలిసింది. 2021 – 2022 ఆర్థిక ఏడాది ప్రకారం చివరి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను తగ్గించలేదని తెలిసింది.

కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చేనెలలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా లలో ఎన్నికల నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉండటంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై 7.1 శాతం, 6.8 శాతం వడ్డీ రేట్లు వరుసగా కొనసాగనున్నాయి. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా నోటిఫికేషన్ అందించింది. అందులో.. చిన్నతరహా పొదుపు పథకాలపై 2021-2022 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికం వడ్డీరేట్లలో నాలుగో త్రైమాసికంలోని అమలు చేస్తామని తెలిపారు.

ఇక ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి పాత వడ్డీ రేట్లు అమలు అవుతాయని తెలిపారు. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కారణం చిన్నతరహా పొదుపు పథకాలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ప్రజలే ఎక్కువగా పొదుపు చేయటంతో.. ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను తగ్గించినట్లు తెలిసింది.

Exit mobile version