Site icon 123Nellore

బార్ కోసం కళాశాల దారుల్ని మూసేస్తారా?

సింధూర బార్ అండ్ రెస్టారెంట్ వారికి లబ్ధి చేకూర్చేందుకు వారికి నిబంధనల అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో సర్వోదయ కళాశాల ప్రిన్సిపాల్ బార్ కి ఎదురువైపుగా ఉన్న ద్వారాలను మూసివేశారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా జేఏసీ, ఆర్.ఎస్.ఎఫ్.ఐ, బి.సి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘాలనాయకులు ఆరోపిస్తూ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్ బార్ యాజమాన్యానికి అమ్ముడుపోయారన్నారు. రెండు, మూడు రోజుల్లో మూసిన గేట్లు తీయకపోతే దేవాదాయ శాఖ దృష్టికి ప్రిన్సిపాల్ తీరును తీసుకెళతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినాయకులు అంజయ్య, డొక్కా చిరంజీవి, మురళీకృష్ణ యాదవ్, హరీష్యాదవ్, మనోజ్ యాదవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 
Exit mobile version