Site icon 123Nellore

ప్రజాబాటలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30 వ డివిజన్ గాంధీ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ లలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాబాట నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించగా పారిశుద్ధ్యం లోపించి తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకొచ్చారు.

స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిపించి తక్షణం కాలువల పూడికతీత తీయించి దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలా చేయని పక్షంలో కాలువలను తానే స్వంతంగా పూడిక తీయించి ఆ చెత్తను కార్పొరేషన్ కార్యాలయంలో వేస్తానని హెచ్చరించారు. దీంతో అధికారులు హుటాహుటిన పూడికతీత పనులు ప్రారంభించారు. 

అదేవిధంగా అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజి పనులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పనుల నిమిత్తం రోడ్లు తవ్వి పూడ్చకుండా వదిలేయడాన్ని గమనించిన ఎమ్మెల్యే గుంటలను ఒక క్రమపద్ధతి ప్రకారం పూడ్చాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. స్పందించిన అధికారులు తక్షణం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Exit mobile version