Site icon 123Nellore

పేదల సంక్షేమమే ముఖ్యం: ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి

తమకు పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీ నగర ఇన్ ఛార్జ్, నెల్లూరు నగర మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తెలియజేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి పేదల సంక్షేమమే, అభివృద్ధే ముఖ్యమని అందుకే అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నామని ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. సోమవారం నగర నియోజకవర్గం పరిథిలోని 40 వ డివిజన్ లో జన చైతన్య యాత్రను నిర్వహించారు. డివిజన్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసారు. తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, తెలుగు దేశం పార్టీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డివిజన్ ఇన్ ఛార్జ్ అన్నంగి ప్రసాద్, ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఛైర్మెన్ మెట్టు సురేష్ బాబు, రంగనాయకుల స్వామి ఆలయ కమిటీ ఛైర్మెన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version