Site icon 123Nellore

నెల్లూరు చెరువు పర్యాటక కేంద్రంగా మారుతుందా?

త్వరలో నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయనున్నట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ ఆదివారం పేర్కొన్నారు. రొట్టెల పండుగ సమయంలో కొంతమేర అభివృద్ధి పరచినట్లు రానున్న రోజుల్లో బారాషాహీద్ దర్గా తో పాటు చెరువు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధి చెందనున్నట్లు వివరించారు.స్థానిక నాయకులతో ఆదివారం దర్గా ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ మరో ఐదారు నెలల్లో స్పీడ్ బోటు షికారు, మ్యూజికల్ ఫౌంటెన్, చాట్ సెంటర్లను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు చెరువు ప్రాంత అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు మంజూరుచేశారని, ఆ నిధులతో ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చనున్నట్లు స్పష్టం చేసారు.
Exit mobile version