Site icon 123Nellore

నెల్లూరుకు వస్తున్నా ఏర్పాట్లు చేసుకోండి అంటున్న నందమూరి బాలకృష్ణ

వచ్చే ఏడాది మే 1 న నెల్లూరులో జరగనున్న భగవద్ రామానుజుల స్వామి వారి శత సహస్రాబ్ది ఉత్సవాలకు రావాల్సిందింగా సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను గురువారం హైదరాబాద్ లో తల్పగిరి రంగనాథస్వామి ఆలయ చైర్మన్ మంచికంటి సుధాకరరావు, ప్రధాన అర్చకులు కిదాండి జగన్నాథరావు ఆహ్వానించారు. ఆయనకు వేదవచనాలు, రంగనాథస్వామి ప్రసాదం అందజేశారు. సామజిక సంస్కర్త భగవద్ రామానుజుల స్వామి విగ్రహాన్ని ఆయన జన్మదినం సందర్భంగా మే 1 న రంగనాథ స్వామి ఆలయం ఎదురుగా ప్రతిష్టిస్తున్నామని తప్పక రావాల్సిందిగా కోరారు. నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర లో తమ తండ్రి ఎన్టీఆర్ భగవద్ రామానుజులుగా నటించారని, ఆయన వారసునిగా తాను విగ్రహ ప్రతిష్ట వేడుకకు తప్పక వస్తానని, ఏర్పాట్లు చేసుకోవాల్సిందింగా నిర్వాహకులకు తెలియజేసారు. వచ్చే ఏడాది జరగనున్న ఈ వేడుకలను జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. 
 
Exit mobile version