Site icon 123Nellore

ఉత్సాహంగా హైదరాబాద్ 10కె రన్

ప్రతి అడుగు ఆరోగ్యానికి తొలి మెట్టు అనే నినాదంలో…సిటీలోని నెక్లెస్ రోడ్ లో ఫ్రీడం 10కే రన్ ఉత్సాహంగా సాగింది. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, సినీనటులు రామ్ చరణ్, హీరోయిన్ రాశిఖన్నా జెండా ఊపీ రన్ ను ప్రారంభించారు. సిటీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన రన్నర్స్…ఔత్సహికులు ఈ రన్ లో పాల్గొన్నారు.

నగరంలో ఇలాంటి ఈ వెంట్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఆటలు, ఆరోగ్యం పట్ట ప్రచారం కల్పించేందుకు ఇలాంటి రన్స్ మరిన్ని చేపట్టాలన్నారు. మరోవైపు రన్ లో పాల్గొన్న రామ్ చరణ్, రాశిఖన్నాలను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. ఇలాంటి రన్స్ లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు రన్నర్స్.

ఇదిలా ఉంటే.. పీపుల్స్ ప్లాజాలో పిట్ నెస్, హెల్త్ కు సంబంధించి…దాదాపు 20 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రన్ లో పాల్గొనే వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. మరోవైపు రన్ సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

Exit mobile version